ఎస్పీ బాలసుబ్రమణ్యం గురించి ఆయన చెప్పిన జోస్యం అక్షరాలా నిజమైందట!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా అప్పటికీ ఆయన పాడిన ఎన్నో మధురమైన పాటలు చిరకాలం నిలిచిపోతాయి.

ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు పాడుతూ ఎంతోమంది హృదయాలను ఆకట్టుకుని ఎస్పీ బాలసుబ్రమణ్యం మరణించి ఏడాది కాలం అయింది.ఎస్పీబీ లెజెండ్‌గా ఆ తర్వాతే మనందరికీ తెలుసు గాని ఆయన ఎవరికి తెలియక ముందే ఆయన గురించి ఓ వ్యక్తి ఎంతో ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించారు.

ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడాలంటే ఘంటసాలగారి అన్న రోజులలో మేడంటే మేడా కాద గూడంటే గూడూ కాదు అంటూ పాట పాడుతూ.సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి కంట పడ్డాడు.

ఈ పాట విన్న ఆయన ఈ కుర్ర బాలులో భవిష్యత్తు గాన గంధర్వుడిని చూశారు.

Advertisement

ఆ పాటల పోటీలో పాల్ సుబ్రహ్మణ్యం గారి ప్రతిభను గుర్తించి దగ్గరకు పిలుచుకొని సినిమాలో అవకాశం ఇస్తే పాడుతావ అని అడిగార .పద్ధతిగా ఉంటే ఇండస్ట్రీలో 40 ఏళ్ళు కొనసాగ గలవు అంటూ అప్పుడు ఆయన అన్న విధంగానే ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో అద్భుతంగా రాణించారు.రోజు తనకు అవకాశం కల్పించిన తన గురువుగారి పేరుని ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు తన రికార్డింగ్ థియేటర్ కి పెట్టుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఓ సందర్భంలో మాట్లాడుతూ నాకు జీవితాన్ని ఇచ్చిన ఆయనకు నా చర్మం ఒలిచి ఆయన కుటుంబానికి ఊడిగం చేసినా రుణం తీర్చుకోలేను అని బాలు గారు చెప్పే వారు.

Advertisement

తాజా వార్తలు