ఏపీలో ఆరుగురు ఐఏఎస్ లు బదిలీలు..!!

ఏపీ ప్రభుత్వం తాజాగా ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది.

ఈ మేరకు ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

బదిలీ అయిన అధికారుల వివరాలు చూస్తే అమరావతి రీజియన్ డెవలప్మెంట్ ఏరియా కమిషనర్ గా కె విజయ, ఏఎంఆర్ డీఏ అడిషనల్ కమిషనర్ గా పి ప్రశాంతి, సీసీఎల్ ఏ అప్పీల్స్ కమిషనర్ గా డాక్టర్ పి లక్ష్మీనరసింహం, గుంటూరు జిల్లా గ్రామ, వార్డు సచివాలయాల అభివృద్ధి జేసీగా రాజకుమారి.కడప ఆర్ డీ ఓ గా పి రామచంద్రారెడ్డి, ఎనర్జీ డిపార్ట్ మెంట్ డిప్యూటి కార్యదర్శిగా పృథ్వీతేజ్ లు బదిలీ అయ్యారు.

విషయంలోకి వెళ్తే ఇంత సడన్ గా ఏపీ ప్రభుత్వం బదిలీ చేయడానికి గల కారణం చూస్తే జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రక్రియ ప్రారంభించిన నేపథ్యంలో గతంలో రాజధానికి సంబంధించి టీడీపీ ఏర్పాటు చేసిన సీఆర్డీఏ ను రద్దు చేసి దాని స్థానంలో ఏఎంఆర్డీఏను తీసుకురావడమే.

రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!
Advertisement

తాజా వార్తలు