నేడు తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..!!

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు రెండు తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నారు.ఏపీ లో శ్రీశైలం దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఈరోజు ఉదయం 9 గంటలకు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం కి చేరుకుని అక్కడి నుండి హెలికాప్టర్ ద్వారా శ్రీశైలం కి రానున్నారు.అనంతరం భగవంతుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రత్యేకమైన హెలికాప్టర్ ద్వారా.

హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుండి మళ్ళీ తిరిగి ఢిల్లీకి చేరుకోనున్నారు.

లోక్ సభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిన మరుసటి రోజే అమిత్ షా శ్రీశైలం పర్యటన చేపట్టడం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.నల్లమల అటవీ ప్రాంతం కావడంతో.

Advertisement

అమిత్ షా రాక నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.కేంద్ర హోంమంత్రి కావటంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అంతర్గతంగా అలర్ట్ నెలకొంది.

అమిత్ షా తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ అధికారులతో పాటు బీజేపీ నాయకులు కూడా భారీగా ఆయనకు స్వాగతం పలకడానికి రెడీ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు