నీ మనస్సు బంగారం తల్లి.. మీరాబాయి చానూ గురించి చిరంజీవి ట్వీట్ వైరల్!

భారతీయ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూ మన దేశానికి ఈ ఏడాది జరిగిన ఒలింపిక్స్ లో తొలి రజత పతకాన్ని తెచ్చిన సంగతి తెలిసిందే.49 కేజీల కేటగిరీలో మీరాబాయి చానూ ఈ పతకాన్ని సొంతం చేసుకోవడం గమనార్హం.

తాజాగా స్టార్ హీరో చిరంజీవి మీరాబాయి చానును మరోమారు అభినందించడంతో పాటు మీరాబాయి చానూ గురించి చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సిల్వర్ మెడల్ గెలిచిన తర్వాత మీరాబాయి కొంతమంది కోసం వెతుకుతూనే ఉన్నారు.మొత్తంగా 150 మందిని వెతికి మీరాబాయి చానూ వారికి భోజనాలతో పాటు బట్టలు పెట్టి వాళ్ల ఆశీర్వాదం తీసుకున్నారు.

ఇంఫాల్ స్పోర్ట్స్ అకాడమీ మీరాబాయి ఛాను ఊరి నుంచి ఏకంగా 25 మైళ్ల దూరం ఉంది.అక్కడికి ప్రతిరోజు వెళ్లడానికి డ్రైవర్లు, క్లీనర్లు, హెల్పర్లను తన ఇంటికి పిలిచి మరీ మీరాబాయి చానూ సత్కరించారు.

తన గెలవడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరికీ మీరాబాయి ఇంటికి పిలిచి మర్యాదలు చేయడం గమనార్హం.

Advertisement

మీరాబాయి చానూ ఇలా చేయడంతో చిరంజీవి ఆమెను మెచ్చుకోవడంతో పాటు నీ మనస్సు బంగారం తల్లి అని కొనియాడారు.చిరంజీవి చేసిన ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.ప్రతిభ ఉన్నవాళ్లను మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సహిస్తూ మంచి మనస్సును చాటుకుంటున్నారు.

మరోవైపు చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కాగా మెగాస్టార్ కొత్త సినిమాలకు వరుసగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

చిరంజీవి కొత్త సినిమాలలో ఎక్కువ సినిమాలు రీమేక్ సినిమాలు కావడంతో చిరంజీవి అభిమానులు మెగాస్టార్ స్ట్రెయిట్ కథలను ఎంచుకోవాలని కోరుకుంటున్నారు.త్వరలో చిరంజీవి నటిస్తున్న లూసిఫర్ రీమేక్ ప్రారంభం కానుండగా చిరంజీవి ఇతర సినిమా షూటింగ్ కూడా ఈ ఏడాదే ప్రారంభం కానుందని తెలుస్తోంది.మరోవైపు చిరంజీవి కొత్త సినిమాల్లో హీరోయిన్లుగా ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు