నాగార్జునసాగర్ నియోజకవర్గ పర్యటనలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పర్యటించారు.

ఈ సందర్భంగా నియోజకవర్గంలో హాలియా లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో కెసిఆర్ పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.

నియోజకవర్గంలో అనేక ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి.వాటన్నిటినీ త్వరలోనే పరిష్కరిస్తామని, హాలియా ని సుందరంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేస్తామని ప్రజలకు తెలిపారు.

అదేరీతిలో నందికొండ మున్సిపాలిటీ లో ఉన్న ఇళ్లను రెగ్యులరైజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు.హాలియా నందికొండ మున్సిపాలిటీ లకి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్లు నియోజకవర్గ అభివృద్ధికి 150 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కేసిఆర్ పేర్కొన్నారు.

కరోనా బారిన పడటంతో నియోజకవర్గానికి రావటానికి ఆలస్యం అయినట్లు కేసిఆర్ సభలో ప్రజలకు తెలిపారు.లిఫ్ట్ లు మొత్తం త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుందని నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తామని అన్నారు.

Advertisement

నాగార్జున ఉప ఎన్నికల సమయంలో కేసిఆర్ అప్పట్లో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాటన్నిటినీ నెరవేర్చే దిశగా నియోజకవర్గంలో పర్యటించడం తో పాటు అనేక హామీలు ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు సంతోషంగా ఉన్నారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు