ఢిల్లీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వీసీగా కరణం మల్లీశ్వరి..!

ఢిల్లీ సర్కారు స్పోర్ట్స్ యూనివరిస్టీ ఏర్పాటుకి రంగం సిద్ధం చేసింది.దేశ రాజధానిలో ఏర్పాటు చేస్తున్న ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో వైఎస్ చాన్సలర్ గా ఏపీకి చెందిన ప్రఖ్యాత వెయిట్ లిఫ్టర్ పద్మశ్రీ కరణం మల్లీశ్వరిని నియమించారు.

 Karnam Malleshwari Appointed As Delhi Sports University Vice Chancellor, Appoint-TeluguStop.com

ఈ మేరకు ఆప్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఆమె మొదటి వీసీ అవుతారని ఉత్తర్వుల్లో చెప్పుకొచ్చారు.

త్వరలోనే దీనికి సంబంధించిన విధానాలు మొదలు పెడతారని చెప్పారు.

ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఆటగాళ్లు తాము ఎంచుకున్న క్రీడలో డిగ్రీ పొందవచ్చని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా చెప్పారు.

మరే డిగ్రీ చేయాల్సిన అవసరం లేకుండా ఈ డిగ్రీ సరిపోతుందని అన్నారు.ఒలంపిక్ క్రీడల్లో దేశానికి కనీసం 50 స్వర్ణ పతకాలు తెచ్చేలా క్రీడాకారులను తీర్చిదిద్దడమే ఈ యూనివర్సిటీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు.

ఢిల్లీ స్పోర్ట్స్ యూనివరిస్టీ క్రీడారంగంలో దేశం గర్వించేలా చేస్తుందని చెప్పారు.డిగ్రీ స్థాయి నుండి పీ.హెచ్.డీ వరకు వివిధ క్రీడల్లో వర్సిటీ కోర్సులు ఉంటాయని వెల్లడించారు.

ఢిల్లీలో మొదలు పెడుతున్న ఈ యూనివర్సిటీ ఎంతోమంది ఔత్సాహిక క్రీడాకారులకు మంచి అవకాశమని చెప్పొచ్చు.తప్పకుండా అక్కడ డిగ్రీ పొందే అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగ పరచుకునేలా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube