రూ.2.5 కోట్ల సినిమాకు రూ.10 కోట్ల బిజినెస్‌.. యూవీ వారి లక్‌

సంతోష్‌ శోభన్‌ హీరోగా రూపొందిన ఏక్ మినీ కథ ఇటీవలే అమెజాన్ లో స్ట్రీమింగ్‌ మొదలు అయిన విషయం తెల్సిందే.

ఏక్ మినీ కథ సినిమా కోసం ప్రభాస్ మరియు రామ్‌ చరణ్‌ లు ప్రమోషన్ చేశారు.

యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మించిన ఈ సినిమా కు పాజిటివ్ టాక్ దక్కింది.సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కేవలం రెండున్నర కోట్లతో ఈ సినిమా ను యూవీ వారు తెరకెక్కించారు.డిజిటల్‌ రైట్స్, శాటిలైట్‌ రైట్స్ ఇంకా ఇతర రైట్స్ మొత్తం కలిపి రూ.10 కోట్లకు అమ్మేసినట్లుగా తెలుస్తోంది.సినిమా పై ఏకంగా ఏడున్నర కోట్లు యూవీ వారికి మిగిలాయి.

సినిమా ను ప్రభాస్ కోరిక మేరకు యూవీ వారు సంతోష్‌ శోభన్‌ తో తెరకెక్కించారు.వర్షం సినిమా తో తనను హీరోగా నిలబెట్టినందుకు గాను శోభన్‌ తనయుడు సంతోష్‌ ను హీరోగా నిలబెట్టాలని ప్రభాస్‌ భావించాడు.

అందుకే ఆయనతో వరుసగా తన హోం బ్యానర్‌ వంటి యూవీ క్రియేషన్స్‌ లో సినిమా లు నిర్మింపజేస్తున్నాడు.ఏక్‌ మినీ కథతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న యూవీ వారు ఆ మొత్తంను మళ్లీ సంతోష్‌ శోభన్‌ పైనే పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌ హీరోగా దాదాపుగా అయిదు నుండి ఆరు కోట్ల బడ్జెట్‌ తో మరో లో బడ్జెట్‌ సినిమా ను కూడా నిర్మించేందుకు సిద్దం అయ్యారు.ఈసారి మరింత కమర్షియల్‌ మూవీగా సంతోష్‌ శోభన్‌ నటించబోతున్న సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా ను కేవలం రెండు నుండి మూడు నెలల్లోనే పూర్తి చేసి థియేటర్‌ లేదా ఓటీటీ ఆ సమయంకు ఏది వీలు అయితే ఆ ప్లాట్‌ ఫామ్ ద్వారా విడుదల చేయాలని భావిస్తున్నాడు.ఏక్‌ మినీ కథ లో సంతోష్‌ లో కామెడీ యాంగిల్‌ ను చూశాం.ఇక ఆయన తదుపరి సినిమా లో అంతకు మించి అన్నట్లుగా చూడబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రస్తుతం మారుతి అందుకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ ను ముగించే పనిలో ఉన్నాడు.షూటింగ్‌ లు మొదలు అయిన వెంటనే కొత్త సినిమా పట్టాలెక్కబోతుంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు