ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ ఆ క్రికెటర్ తో ప్రేమలో పడిందట.. కానీ....

సినిమా పరిశ్రమలో లవ్ ఎఫైర్లు అప్పుడప్పుడు కామన్ గా వినిపిస్తుంటాయి.

అయితే ఇందులో కొన్ని ప్రేమ జంటలు పెళ్లికి దారి తీస్తే మరి కొన్ని ప్రేమ జంటలు మాత్రం డేటింగ్ తో సరి పెట్టుకుని ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతుంటారు.

ఇలాంటి ప్రేమ జంటలు సినిమా పరిశ్రమలో చాలానే ఉన్నాయి.తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన "నేను మీకు తెలుసా.?" అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నటిగా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ "రియా సేన్" టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే ఈ అమ్మడు మొదటగా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరస సినిమా అవకాశాలతో కొంతకాలం పాటు బాగానే రాణించింది.

ఆ తర్వాత కథల పట్ల మరియు తన పాత్రల పట్ల కొంతమేర అవగాహన లోపించడంతో క్రమక్రమంగా సినిమా అవకాశాలను కోల్పోయింది.దీనికితోడు ఈ అమ్మడు అప్పట్లో భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఓ ప్రముఖ ఆల్ రౌండర్ క్రికెటర్ తో ప్రేమాయణం నడిపిందట.

కానీ ఈ ప్రేమ పెళ్లికి మాత్రం దారి తీయలేదు.దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రియా సేన్ కొంత కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.ఆ తర్వాత మళ్లీ కుటుంబ సభ్యుల అండదండలతో కోలుకొని సినిమా కెరీర్ పై దృష్టి సారించింది.

Advertisement

ఇక తన ప్రియుడు కూడా ప్రముఖ వ్యాపార వేత్త కూతురినిపెళ్లి చేసుకున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయం ఇలా ఉండగా రియాసేన్ తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, తదితర భాషలలో కలిపి దాదాపు 20కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.చివరిగా 2017వ సంవత్సరంలో "లోన్లీ గర్ల్" అనే చిత్రంలో నటించింది.కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది ఆ తర్వాత ఈ అమ్మడు మళ్లీ సినిమాల్లో నటించలేదు.

కానీ అప్పుడప్పుడు పలు ప్రముఖ ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాలలో మాత్రం పాల్గొంటూ అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి మతి పోగొడుతుంది.అయితే ఈ అమ్మడు బాలీవుడ్ ప్రముఖ నటి "రైమాసేన్" సోదరి అని చాలా మంది ప్రేక్షకులకు తెలియదు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు