రాకింగ్ స్టార్ యష్ తో పొలిటికల్ థ్రిల్లర్ ప్లాన్ చేస్తున్న పూరి

కేజీఎఫ్ సినిమాతో ఒక్కాసారిగా ఇండియన్ వైడ్ పాపులర్ అయిపోయిన కన్నడ హీరో యష్.

కేజీఎఫ్ మూవీకి ముందుగానే కన్నడ ఇండస్ట్రీలో రాకింగ్ స్టార్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న యష్ ఇప్పుడు ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో ఇండియన్ వైడ్ గా ఫాలోయింగ్ ఉంది.

ఈ నేపధ్యంలో అతని నెక్స్ట్ సినిమాలు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఒకే ఒక్క సినిమా చేసిన యంగ్ డైరెక్టర్ తో సినిమా చేయడానికి యష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ మూవీని భారీ బడ్జెట్ తో యూనివర్శల్ కాన్సెప్ట్ తోనే చేస్తున్నారు.ఇదిలా ఉంటే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ మూవీ తర్వాత యష్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే అతనికి కథ కూడా నేరేట్ చేసి ఒకే చేయించుకున్నట్లు టాక్.కన్నడంలో పూరి జగన్నాథ్ గతంలో రెండు సినిమాలు తెరకెక్కించాడు.

Advertisement

ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.ఇప్పుడు యష్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్ మొదటి సారి పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.ఇప్పటి వరకు పూరి సినిమాలు అన్ని కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే ఎక్కువగా తెరకెక్కాయి.

అయితే యష్ కోసం మాత్రం కంప్లీట్ గా జోనర్ మార్చి ప్రస్తుత రాజకీయాలపై సెటైరికల్ సందేశం చెప్పే ప్రయత్నం పూరి చేస్తున్నాడని తెలుస్తుంది.లైగర్ పూర్తయిన తర్వాత ఈ మూవీని ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని బోగట్టా.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు