టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు షాకిచ్చిన జీవీఎంసీ అధికారులు.. ?

ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో వైసీపీ నేతలకు చుక్కలు చూపించిన విషయం అందరికి తెలిసిందే.

ప్రస్తుతం వైసీపీ అధికారంలోకి వచ్చాక అదేస్దాయిలో టీడీపీ నేతలను ఇరుకున పెడుతున్నట్టుగా ఇప్పటికే ఏపీలో ప్రచారం జరుగుతుంది.

అదీగాకుండా ఈ ఇరుపార్టీ నేతలు చేసుకుంటున్న ఆరోపణలు ఎప్పుడో హద్దులు దాటాయి.ఈ క్రమంలో అధికార పార్టీ నేతలు టీడీపీ లొసుగులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ వారికి మచ్చెమటలు పట్టిస్తున్నారు.

ఇదే క్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు జీవీఎంసీ అధికారులు షాకిచ్చారు.టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుకు చెందిన షాపింగ్ కాంప్లెంక్స్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు.

విశాఖపట్నంలోని పాత గాజువాక సెంటర్‌ వద్ద నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌ను ఈరోజు తెల్లవారుజామున అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ అధికారులు కూల్చివేశారు.ఈ నేపధ్యంలో ముందస్తూగా నోటీసులు ఇవ్వకుండా ఎలా కూలుస్తారంటూ పల్లా శ్రీనివాసరావు వాదిస్తుండటంతో అక్రమ నిర్మాణం అని తేలితే ఎలాంటి చర్యలకైనా సిద్ధమంటు పేర్కొంటున్నారు కార్పోరేషన్ అధికారులు.

Advertisement
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

తాజా వార్తలు