ఫ్లాప్ దర్శకుడుకి మరో సారి ఛాన్స్ ఇచ్చిన ఆది సాయి కుమార్

ప్రేమ కావాలి సినిమాతో టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు ఆది సాయి కుమార్.

డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడుగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అది సాయి కుమార్ కెరియర్ ఆరంభంలో ప్రేమ కావాలి, లవ్ లీ సినిమాలతో హిట్స్ సొంతం చేసుకొని మంచి టాలెంటెడ్ యాక్టర్ అనిపించుకున్నాడు.

ఆ తరువాత నుంచి అతని కెరియర్ లో గ్యాప్ లేకుండా ఫ్లాప్ లు వస్తున్నాయి.రొటీన్ కథలు, కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలు చేస్తూ ఉండటం వలన ఆదికి సక్సెస్ రావడం లేదనేది చాలా మంది మాట.అయితే సక్సెస్ లేకపోయినా ఆది చేతినిండా సినిమాలు ఉన్నాయి.రీసెంట్ గా శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకి ఆది వచ్చాడు.

ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.అయితే ఇప్పుడు ఇతను నటించిన బై లింగ్వల్ మూవీ ఒకటి రిలీజ్ కి రెడీగా ఉంది.

అలాగే మరో మూడు సినిమాలు చేతిలో ఉన్నాయి.వాటిలో ఒకటి షూటింగ్ దశలో ఉంది.

Advertisement

ఇదిలా ఉంటే తాజాగా మరో దర్శకుడుతో ఆది సాయి కుమార్ సినిమా ఒకే చేయించుకున్నాడు.ఆహ నా పెళ్ళంట సినిమాతో దర్శకుడుగా కెరియర్ ప్రారంభించి హిట్ కొట్టిన వీరభద్రం తరువాత సునీల్ తో పూలరంగడుతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో కింగ్ నాగార్జున పిలిచి అవకాశం ఇచ్చాడు.అతనితో భాయ్ అనే సినిమా చేశాడు.

అయితే ఈ సినిమా అతని కెరియర్ మీద తీవ్ర ప్రభావం చూపించింది.సినిమా తెరకెక్కించిన విధానంపై ఏకంగా నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆ సినిమా తర్వాత చాలా కాలం కనిపించకుండా పోయిన వీరభద్రం మళ్ళీ ఆదితో చుట్టాలబ్బాయ్ అనే సినిమాతో కనిపించాడు.ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అయినా కూడా ఆది అతని దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఒకే చెప్పాడు.తాజాగా ఈ సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

Advertisement

తాజా వార్తలు