ఏపీ ఇంటర్ బోర్డు పై అవినీతి ఆరోపణలు.. ?

మన దేశంలో అవినీతీ అంటే అయస్కాంతం లాంటిది.చటుక్కున అతుక్కుపోతుంది.

అందుకే కావచ్చూ ప్రతి చోట అవినీతి రాజ్యమేలుతుంది.

ఏ పనికావాలన్న జేబులు తడప వలసిందే.

ఈ అవినీతి చివరికి విద్యావ్యవస్దను కూడా వదలడం లేదు.ఇకపోతే తాజాగా ఏపీ ఇంటర్ బోర్డులో జరుగుతున్న అవినీతి దందా వెలుగులోకి వచ్చింది.

దరఖాస్తు కూడా చేయని కాలేజీలకు అధికారులు అనుమతులు ఇచ్చారని.ఇందుకు గాను ఒక్కో కాలేజీ నుండి రూ.లక్ష నుండి రూ.2 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

Advertisement

ఇలా మొత్తం కలిపి కాలేజీలకు అనుమతులు ఇవ్వడంలో రూ.2 కోట్లు వరకు వసూళ్లకు పాల్పడినట్లు, కోర్సుల డిమాండ్ ను వారు సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.అందుకే ఈ అవినీతి ఆరోపణల విషయంలో ముగ్గురు అధికారులపై వేటు పడింది.

కాగా ఏపీ ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ బాధ్యతల నుంచి తొలగించబడ్డారు.సూపరిండెంట్, జూనియర్ అసిస్టెంట్ లపై కూడా బదిలీ వేటు పడింది.

Advertisement

తాజా వార్తలు