షర్మిల కొత్త పార్టీ పై స్పందించిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.

ఇటీవల కేంద్రం బడ్జెట్ సమావేశాలు టైం లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయడానికి నిర్ణయం తీసుకోవడంతో ఆ విషయంలో పునరాలోచించాలని.

ఆంధ్ర సెంటిమెంట్ గౌరవించాలని పవన్ కళ్యాణ్ కేంద్ర పెద్దలను కలవడం జరిగింది.ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడ భేటీ కావడం జరిగింది.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.అమిత్ షా తో చర్చించిన విషయాలు గురించి వివరించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో అదేవిధంగా ఆలయాల పై జరుగుతున్న దాడులు గురించి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.  అదేవిధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై కూడా చర్చించినట్లు పేర్కొన్నారు.

Advertisement

అనంతరం పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధులు ప్రస్తుత రాజకీయాల గురించి అనేక విషయాలు ప్రశ్నించడం జరిగింది.ఈ ప్రశ్నలో భాగంగా షర్మిల కొత్త పార్టీ గురించి.

మీ రియాక్షన్ ఏంటి అని అడిగారు.దానికి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యి ఆమె ఇంకా పార్టీ పెట్టినట్టు ఎక్కడ స్పష్టత ఇవ్వలేదు కదా.పార్టీ పెట్టిన తర్వాత.విధి విధానాలు బట్టి అప్పుడు రియాక్ట్ అవుతాను అని పేర్కొన్నారు.

అంత మాత్రమే కాక ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు అని స్పష్టం చేశారు.తెలంగాణలో ఆమె పార్టీ పెట్టడం పట్ల నిజంగా స్వాగతిస్తున్నాం అని పవన్.

షర్మిల కొత్త పార్టీ వార్తలపై తనదైన శైలిలో స్పందించారు.

నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 
Advertisement

తాజా వార్తలు