టాలీవుడ్ కామెడీ హీరో అల్లరి నరేష్ ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘బంగారు బుల్లోడు’ను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు.
ఎప్పుడో షూటింగ్ ముగించుకున్న ఈ సినిమా కరోనా కారణంగా రిలీజ్ను వాయిదా వేసుకుంది.
కాగా ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే హిట్ అందుకునేందుకు అల్లరోడు రెడీ అవుతున్నాడు.పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ కథతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి తనదైన మార్క్ వేసుకునేందుకు ఈ హీరో ప్లాన్ చేస్తున్నాడు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ ఆద్యాంతం ప్రేక్షకులను అలరించే అంశాలతో ఉండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ ట్రైలర్లో సినిమా కథ ఏమిటో మనకు చెప్పేశాడు దర్శకుడు గిరి పాలిక.ఈ సినిమాలో బంగారంపై లోన్ తీసుకునేందుకు జనం బ్యాంక్లో తమ బంగారు నగలు పెడుతుండగా, అందులో పనిచేసే అల్లరి నరేష్ అండ్ గ్యాంగ్ తమకు కావాల్సిన వారికి ఆ నగలు ఇస్తుంటారు.
ఈ క్రమంలో చోటు చేసుకునే ఘటనలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయా అనేది సినిమా కథగా ఉండబోతున్నట్లు ఈ ట్రైలర్లో తెలిపారు.మొత్తానికి ఈ సినిమాను పూర్తిగా కామెడీ ఎంటర్టైనింగ్ కథతో తీసుకొస్తున్న అల్లరి నరేష్, ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన పూజా ఝవేరీ హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా అనిల్ సుంకర ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ సినిమాను జనవరి 23న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.కాగా అల్లరి నరేష్ నటిస్తున్న మరో చిత్రం నాంది కూడా రిలీజ్కు రెడీ అయిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy