న్యూ లుక్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మెగాస్టార్..!

కొద్ది రోజుల క్రితం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కరోనా వైరస్ బారిన పడి అందులో నుంచి బయటికి వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

అయితే కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక ఆయన కొత్త లుక్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

తాజాగా ఆయన ఫోటో చూసి అన్నయ్య ఏమన్నా ఉన్నాడా అంటూ పెద్ద ఎత్తున అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.కేవలం ఆయన ఆరాధించే వ్యక్తి మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా అదే విధంగా ఆశ్చర్యపోతున్నారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సంబంధించిన కొత్త ఫోటోలు విడుదల అయ్యాయి.అయితే ఈ ఫోటోలు తాజాగా ఆహా యాప్ కోసం నటి సమంత పోస్ట్ చేస్తున్న స్యామ్ జామ్ టాక్ షో కోసం ఆయన వచ్చారు.

ఆ షో కు సంబంధించిన ఫోటోలు విడుదల కావడంతో నిజంగా చాలామంది ఆశ్చర్యపోయారు.ప్రస్తుతం చిరంజీవి 65 సంవత్సరాలు ఉన్నా కానీ ఆయనకు అన్ని సంవత్సరాలు నిండిపోయాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.65 ఏళ్లు సంవత్సరాల్లో కూడా ఆయన ఇలాంటి ట్రెండీ లుక్ తో కనిపించడంతో అందరూ ఫిదా అయిపోతున్నారు.మామూలుగా పర్సనల్ ఇంటర్వ్యూ లకు అంతగా ఒప్పుకొని చిరంజీవి తాజాగా సమంత కోసం శ్యామ్ జామ్ కు మాత్రం ఆయన దర్శనమిచ్చాడు.

Advertisement

దానికి మరో కారణం కూడా లేకపోలేదు.ఆహా యాప్ అల్లుఅరవింద్ సంబంధించిన సంస్థ కావడంతో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన క్యార్ వ్యాన్ నుండి దిగి వెళ్ళే సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.ఆ డ్రెస్ సెలక్షన్, ఆ మేక్ ఓవర్ తీసుకురావడానికి తన కూతురు సుస్మిత స్టైలిష్ గా డిజైన్ చేసింది.ఇంతకుముందు చిరంజీవి లాక్ డౌన్ సమయం అంతా ఫిజిక్ పైనే ఫోకస్ చేశారు అంటే అందరూ ఏమో అనుకున్నారు కానీ, తాజాగా ఆయన లుక్ చూస్తే అందరూ అవుననే అనుకుంటున్నారు.

కేవలం టీవీ కార్యక్రమం కోసమే ఇంతలా రెడీ అయ్యడంటే సినిమాల కోసం ఇంకెంత లుక్ తో ఆయన కనిపిస్తారో వేచి చూడాల్సిందే.ఇకపోతే సమంత మొదలుపెట్టిన స్యామ్ జామ్ కార్యక్రమంలో మొదటి ఎపిసోడ్ కదా విజయ్ దేవరకొండ ను ఇంటర్వ్యూ చేయగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి తో ఇంటర్వ్యూ చేసింది సమంత.

ముందు ముందు అనేక మంది టాప్ హీరోలతో సమంత టాక్ షో చేయబోతున్నట్లు సమాచారం.

తల్లీదండ్రులు మట్టి కార్మికులు.. 973 మార్కులు సాధించిన శ్రావణి.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు