షోతో దుమ్ములేపుతానంటోన్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా దశాబ్ద కాలంగా టాలీవుడ్ ప్రేక్షకులను తన అందంతో పాటు అభినయంతోనూ మెప్పిస్తూ వస్తోంది.

స్టార్ హీరోయిన్‌గా పలు సినిమాలతో సత్తా చాటిన ఈ బ్యూటీ, ప్రస్తుతం వస్తున్న ప్రతి ఆఫర్‌ను కూడా ఓకే చేస్తూ వెళ్తోంది.

కాగా ప్రస్తుతం తమన్నా మ్యాచో హీరో గోపీచంద్ సరసన సీటీమార్ అనే సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో వస్తోండగా, ఇందులో కబడ్డీ కోచ్‌గా తమన్నా కనిపిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమా తరువాత తమన్నా ఏ సినిమాలో నటిస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.అయితే తమన్నా మాత్రం త్వరలో ఓ ఓటీటీ ప్లాట్‌ఫాంపై డెబ్యూ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

తెలుగులో దూసుకుపోతున్న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నాడు.ఈ క్రమంలోనే తమన్నాతో ఓ టాక్‌షో నిర్వహించేందుకు ఆహా ఓటీటీ నిర్వాహకులు రెడీ అవుతున్నారు.

Advertisement

కాగా త్వరలోనే ఈ టాక్ షోలో పాల్గొనేందుకు తమన్నా రెడీ అవుతుందని వారు అంటున్నారు.అయితే ఈ షోలో అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌, రానా దంపతులు, ర‌వితేజ త‌దిత‌ర స్టార్ హీరోల‌తో పాటు హీరోయిన్లు కూడా పాల్గొంటారని తెలుస్తోంది.

మొత్తానికి ఓటీటీ ప్లాట్‌ఫాంపై తమన్నా యాంకర్‌గా మారి టాక్ షో చేయనుండటంతో ఈ షో ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.ఇక తమన్నా చేయబోయే ఈ షో ఎలాంటి విజయాన్ని అందుకుంటుదా, ప్రేక్షకులను ఈ షో ఎలా మెప్పిస్తుందా అని ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు.

యాంకర్‌గా తమన్నా హిట్ అవుతందా లేక ఫట్ అవుతుందో తెలియాలంటే ఈ షో టెలికాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే.ఇక సీటీమార్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు తమన్నా రెడీ అవుతోంది.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు