వివాదాస్పద ట్వీట్ల కేసులో క్షమాపణ చెప్పమని సుప్రీంకోర్టు ఆదేశించింది.ఈ మేరకు లాయర్ ప్రశాంత్ భూషణ్ ససేమిరా కాదన్నారు.
దీంతో ఆగ్రహించిన అత్యున్నత న్యాయస్థానం న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పై జరిమానా విధించింది.ఒక రూపాయి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బోబ్డేతో పాటు సీనియర్ న్యాయమూర్తులపై ప్రశాంత్ భూషన్ గతంలో వివాదాస్పద ట్వీట్లు చేశారు.ఈ మేరకు సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది.అరుణ్ మిశ్రా, బీఆర్ గార్గ్, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం ఏర్పడింది.విచారణ చేపట్టిన ధర్మాసనం వివాదాస్పద ట్వీట్ల చేసినందుకు క్షమాపణ చెప్పాలని ఆదేశించింది.
ప్రశాంత్ స్పందించకపోవడంతో మరోసారి హెచ్చరించింది.అయినా ప్రశాంత్ తన పంతం వీడలేదు.
దీంతో ధర్మాసనం ప్రశాంత్ పై జరిమానా విధించింది.క్షమాపణ చెప్పకపోతే ఒక రూపాయి జరిమానా చెల్లించాలని పేర్కొంది.జరిమానా చెల్లించకపోతే మూడు నెలల పాటు జైలు శిక్ష అనుభవించాలని, లేదంటే మూడేళ్లు న్యాయవాద వృత్తికి దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది.ఈ మేరకు ప్రశాంత్ భూషన్ జరిమానాను చెల్లించాడు.
సుప్రీంకోర్టు విధించిన ఒక రూపాయి జరిమానాను తన తరఫున కోర్టులో వాదించిన న్యాయవాది రాజీవ్ ధావన్ కు అందజేశారు.చివరకు కోర్టుకు జరిమానా చెల్లిస్తున్నట్లు ఫోటో దిగి ట్వీటర్ పోస్ట్ చేసి జరిగిన తతంగాన్ని వెల్లడించారు.