పాకిస్తానీ క్రికెట్ బోర్డ్ నిర్ణయం హాస్యాస్పదంగా ఉంది.ఈమద్య కాలంలో యూట్యూబ్ పరిది బాగా పెరిగింది.
దాంతో చాలా మంది చాలా రకాల వీడియోలను షేర్ చేస్తూ అంతో ఇంతో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.పాక్ మాజీ ఆటగాళ్లు పలువురు గత కొంత కాలంగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉన్నారు.
ఔత్సాహికులకు క్రికెట్ సలహాలు ఇస్తూ ఉన్నారు.చాలా మంది వారి వీడియోలు చూసి క్రికెట్ మెలకువలు నేర్చకున్నారు.
ఇప్పుడు పాకిస్తాన్ బోర్డు ఆ చానెల్స్ ను రద్దు చేయాలంటూ మాజీ క్రికెటర్ లకు ఆదేశాలు ఇచ్చింది.
దేశ జట్టుకు కోచింగ్ ఇచ్చే వాళ్లు ఇలా కీలక విషయాలను యూట్యూబ్ లో చెప్పడం వల్ల ప్రత్యర్థి జట్టు వారికి లాభం చేకూరే అవకాశం ఉందని అందుకే కోచింగ్ ప్యానల్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇకపై యూట్యూబ్ లో వీడియోలను చేయడం మానేయాలంటూ ఆదేశాలు ఇచ్చారు.
ఈ నిర్ణయంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఇంజమామ్, షోయబ్ అక్తర్, ఫైసల్ ఇక్బాల్ వంటి వారు యూట్యూబ్ ల్లో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు.
వారి వీడియోలకు మంచి రెస్పాన్స్ ఉంటుంది.ఇకపై వారి వీడియోలు యూట్యూబ్ లో కనిపించక పోవచ్చు అంటున్నారు.
ఎందుకంటే వారు పాక్ దేశవాళి జట్లకు కోచ్ లుగా వారు ఎంపిక అయ్యారు.పాక్ ఈ నిర్ణయం విచిత్రంగా ఉందని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.