ఆకాష్ పూరీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు... సందేశం ఇవ్వడం తప్పేనా

స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడుగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్న నటుడు ఆకాష్ పూరీ.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న ఆకాష్ తండ్రి దర్శకత్వంలో మెహబూబా అనే సినిమాలో నటించాడు.

ఆ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర చేసిన కూడా అది అతని వయసుకి మించి ఉండటం.పూరీ తన స్టైల్ లో రొటీన్ మాఫియా నేపధ్యంలో కథని నడిపించడంతో ప్రేక్షకులకి పెద్దగా కనెక్ట్ కాలేదు.

అయితే ఈ సారి అలాంటి ప్రయత్నం చేయకుండా తన అసోసియేట్ ని పూరీ దర్శకుడుగా పరిచయం చేస్తూ కొడుకుతో రొమాంటిక్ అనే లవ్ స్టోరీని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాతో ఆకాష్ పూరీని హీరోగా నిలబెట్టాలని భావిస్తున్నాడు.

ఇదిలా ఉంటే హీరోగా ఆకాష్ చేసిన సినిమాలు మూడు మాత్రమే అందులో ఒకటి ఇంకా రిలీజ్ కాలేదు.అయితే తాజాగా ఆకాష్ సోషల్ మీడియాలో తన పుట్టినరోజు సందర్భంగా ముందస్తుగా ఒక ట్వీట్ చేశాడు.

Advertisement

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ, మన క్షేమం కోసం పుట్టిన రోజు వేడుకకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను.కావున మీరు ఎలాంటి సన్నాహాలు చేయకండి.

మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండండి.పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్లీ ఎప్పటి మాదిరిగానే కలుసుకుందాం.

భౌతిక దూరం పాటించి జాగ్రత్తగా ఉండాలంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.అయితే ఈ పోస్ట్ మంచి ఉద్దేశ్యంతోనే చేసిన కొంత మంది నెటిజన్లు మాత్రం ఆకాష్ ని ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

మీరు ఏమైనా స్టార్ రేంజ్ లో ఫీల్ అవుతున్నారా ఫ్యాన్స్ అంటున్నారు అంటూ, అలాగే ఇంకా హీరోగా సరైన సక్సెస్ కూడా చూడలేదు.దీనికి మీ ఫ్యాన్స్ ముందస్తు సన్నాహాలు కూడానా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

అలాగే అతని మీద ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేసి ఆడుకుంటున్నారు.అయితే పూరీ జగన్నాథ్ ని అభిమానించే అందరూ అతని కొడుకుని కూడా అభిమానిస్తారు.

Advertisement

వారే ఆకాష్ పుట్టినరోజు వేడుకలు చేస్తారు.అలాంటి వారికోసం మంచి ఆలోచనతో అతను చేసిన ట్వీట్ పై ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని కొంత మంది నెటిజన్లు ఆకాష్ కి అండగా కామెంట్స్ పెడుతున్నారు.

తాజా వార్తలు