దాంతో పూర్తిగా విసిగిపోయానంటున్న పునర్నవి...

తెలుగులోటాలీవుడ్ యాంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించిన "ఉయ్యాల జంపాల" చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన ముద్దుగుమ్మ పునర్నవి భూపాళం తెలుగు ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది.

అయితే ఈ మధ్య కాలంలో అమ్మడు హీరోయిన్ గా నటించినటువంటి కొన్ని చిత్రాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినప్పటికీ బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అయితే ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.అయితే ఇటీవల సోషల్ మీడియా మాధ్య మైనటువంటి ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొందరు విద్యార్థులు చేసినటువంటి వికృత చర్యల గురించి పునర్నవి భూపాళం స్పందించింది.

ఇందులో భాగంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో "ఇతరులతో ఎలా మెలగాలో తమ పిల్లలకి తెలియజేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే" అంటూ ఓ పోస్ట్ ని షేర్ చేసింది.దీంతో నెటిజన్లు పునర్నవి భూపాళంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో కొందరు నెటిజన్లు చేసినటువంటి వ్యాఖ్యలను పునర్నవి భూపాళం స్క్రీన్ షాట్ తీసి తన స్టోరీ లో పోస్ట్ చేసింది.అంతేగాక "నేను సోషల్ మీడియాలో ఉన్నది ఎవరిని ఉద్దేశించి పోస్టులు పెట్టడం మరియు అసభ్యంగా దూషించడం వంటి వాటికి కాదని" చెప్పు కొచ్చింది.

Advertisement

అలాగే ఈ మధ్య కాలంలో తాను ఇంస్టాగ్రామ్ మాధ్యమంతో పూర్తిగా విసిగిపోయానని తెలిపింది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవల కాలంలో పునర్నవి భూపాళం హీరోయిన్ గా నటించిన టువంటి "ఒక చిన్న విరామం తర్వాత"  అనే చిత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ఈ అమ్మడు హీరోయిన్ గా నటిస్తున్న టువంటి సైకిల్ అనే చిత్రం పై ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఆటల అర్జున్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ చిత్రం కామెడీ డ్రామా జోనర్ లో ఉండబోతున్నట్లు సమాచారం.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు