ఆచార్య విషయంలో అసలు నిజం బయటపెట్టిన త్రిష

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంది.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది.అయితే ఈ సినిమలో తొలుత స్టార్ బ్యూటీ త్రిషను హీరోయిన్‌గా తీసుకున్నారు.

కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ సినిమా నుండి వాకౌట్ చేసింది.దీంతో వెంటనే కాజల్ అగర్వాల్‌ను ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నారు.

ఇక అసలు విషయం ఏమిటంటే ఈ చిత్ర యూనిట్‌లోని ఒక సభ్యుడి వల్లే త్రిష ఈ సినిమా నుండి వాకౌట్ చేసినట్లు తెలుస్తోంది.అతడి పేరు రివీల్ చేసేందుకు త్రిష అంగీకరించలేదు.

Advertisement

మొత్తానికి ఆచార్య చిత్ర యూనిట్‌లోని సభ్యుడి వల్లే త్రిష బయటకు వెళ్లిందంటే, అతడు ఎవరయ్యి ఉంటారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు.

నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...
Advertisement

తాజా వార్తలు