KKD దెబ్బకు మళ్లీ అదే అంటోన్న బ్యూటీ

పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ రీతూ వర్మ, తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపును సాధించింది.

ఈ బ్యూటీ చాలా తక్కువ సినిమాలు చేసి అంతే తక్కువ సమయంలో తెలుగులో కనిపించకుండా పోయింది.

అయితే తానేమీ సినిమాల నుండి తప్పుకోలేదని, తాను సినిమాలు చేస్తున్నానంటూ ఇటీవల ‘‘కనులు కనులను దోచాయంటే’’ అనే సినిమాతో మనముందుకు వచ్చింది.తెలుగు-తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాలో దుల్కర్ సాల్మన్ హీరోగా నటించగా రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది.

రొమాంటిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సడెన్ హిట్‌గా నిలిచింది.దీంతో మరోసారి రీతూ వర్మ లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో మరోసారి ఇలాంటి మూవీకే ఆమె ఓకే చెప్పిందట.తమిళ-తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాలో అశోక్ సెల్వన్, నిత్యా మీనన్ లీడ్ రోల్స్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ సినిమాను అని శశి డైరెక్ట్ చేయనున్నారు.మొత్తానికి ఓ బైలింగువల్ మూవీతో మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చిన రీతూ వర్మ మరోసారి అలాంటి మూవీనే ఎంచుకోవడంతో అందరి చూపు ఆమెవైపు తిరిగింది.

ఇక తెలుగులో నాని హీరోగా తెరకెక్కుతున్న టక్ జగదీష్ సినిమాలో హీరోయిన్‌గా రీతూ వర్మ నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు