టాలీవుడ్ లో 30 ఇయర్స్ పృధ్వీగ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు పృధ్వీ.
ఎప్పుడో కెరియర్ ఆరంభించిన చిన్న చిన్న పాత్రలకే పరిమితం అయిన పృధ్వీ కెరియర్ లో ఖడ్గం సినిమా ఒక టర్నింగ్ ఇస్తే తరువాత లౌక్యం అతనిని స్టార్ కమెడియన్ గా మార్చేసింది.
ఈ సినిమా తర్వాత స్టార్ హీరోల చిత్రాలలో వరుసగా అవకాశాలు అందుకున్న పృధ్వీ రాజకీయాలలోకి వెళ్లి జగన్ వెంట నడించారు.ఎన్నికల తర్వాత ఎస్వీబీసీ భక్తి ఛానల్ చైర్మన్ అయ్యారు.
అయితే అనూహ్య పరిణామాల మధ్య లైంగిక ఆరోపణలు ఎదుర్కొని ఆ పదవిని కోల్పోవాల్సి వచ్చింది.పదవి కోల్పోయిన తర్వాత చాలా కాలంగా మీడియాకి దూరంగా ఉన్న పృద్వీ మరల ఇప్పుడు తెరముందుకి వచ్చారు.
ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మీద, పవన్ కళ్యాణ్ మీద ఇష్టారాజ్యంగా విమర్శలు చేసి మెగా ఫాన్స్ కి టార్గెట్ అయ్యాడు.అయితే తనకి జగన్ ఇచ్చిన పదవి కోల్పోవడంతో పాటు ఆరోపణలు రావడం వలన ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోవడం మానేశారు.
దీంతో అవకాశాలు కూడా అనూహ్యంగా తగ్గిపోయాయి.ఈ విషయాన్ని మీడియా చానల్ తో పంచుకున్నారు.
ఈ ఆవేదనతో ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకుందామని భావించా అని నా పరిస్థితి తెలిసి చిరంజీవి తనని ఎవరైనా చూడండి అని మనుషులని పంపించడంతో పాటు అవకాశాలు అందేలా చేసారని చెప్పుకొచ్చారు.మొత్తానికి ఏ ఫ్యామిలీని అయితే తన రాజకీయ అవసరాల కోసం పృధ్వీ వాడుకున్నాడో ఇప్పుడు అదే ఫ్యామిలీ అండ కారణంగా మరల బయటకి రాగలిగాడు అని మెగా ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy