కరోనా దెబ్బకు మాస్క్ వేసిన ప్రభాస్..!

ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ ఏ.

చైనాలోని వుహాన్ అనే నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని వణికించేస్తోంది.

అలాంటి ఈ వైరస్ భారత్ లోకి ఇప్పటికే ప్రవేశించిన సంగతి తెలిసిందే.ఈ వైరస్ ఎక్కువ వ్యాపించకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది.

ఈ నేపథ్యంలోనే ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి అని కరోనా వైరస్ వ్యాపించకూడదు అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని వైద్యులు సూచిస్తున్నారు.ఈ వైరస్ భయంతో హైదరాబాద్ పాఠశాలలకు ముందస్తుగా సెలవలు ప్రకటించారు.

అయితే ఈ నేపథ్యంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన తదుపరి చిత్రానికి షూటింగ్ కి వెళ్తూ మాస్క్ వేసుకొని కనిపించడు.

Advertisement

నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రభాస్ ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు.కానీ ప్రభాస్ వారి ఆశలను అడియాశలు చేశాడు.కరోనా వైరస్ దెబ్బకు ప్రభాస్ మాస్క్ వేసుకొని కనిపించడు.

దీంతో అభిమానులు అంత డీలా పడిపోయారు.కాగా మాస్క్ వేసుకున్న ప్రభాస్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు