నాసిక్ లో ఘోర రోడ్డు ప్రమాదం, 20 చేరిన మృతుల సంఖ్య

మహారాష్ట్ర రాష్ట్రంలోని నాసిక్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు అధికారులు తెలుపగా ఇప్పుడు ఆ సంఖ్య 20 కి చేరుకున్నట్లు తెలుస్తుంది.

 Major Road Accidentin Nashik-TeluguStop.com

మహారాష్ట్రలోని నాసిక్ లో మంగవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.అతివేగం తో వెళుతున్న ఆటో,బస్సు ఒకదానికొకటి ఢీ కొనడం తో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలో పడిపోయాయి.

దీనితో బయటపడే వీలులేక పలువురు జలసమాధి అయినట్లు తెలుస్తుంది.దీనితో మృతుల సంఖ్య 20 కి చేరుకుంది.

అయితే వెంటనే సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలికి చేరుకొని స్థానికుల సాయం తో 30 మందిని రక్షించినట్లు తెలుస్తుంది.ఈ ప్రమాదం నుంచి బయటపడ్డవారిలో పలువురు గాయపడడం తో వారిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు అధికారులు.

ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.

టైరు పేలిపోవడంతో బస్సు అదుపుతప్పి ఆటోను ఢీకొట్టి దూసుకుపోయిందని, అదే వేగంతో వెళ్లి బావిలో పడడంతో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లు సమాచారం.

బావిలో పడిన ఆటో పై బస్సు పడడం తో ఆటోలో ఉన్న వారంతా నలిగిపోయినట్లు తెలుస్తుంది.ఈ ఘటన సంబందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube