మరింత క్షీణిస్తున్న లాలూ ఆరోగ్యం

బీహార్ మాజీ సీఎం , రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది.దాణా స్కాం లో దోషిగా తేలిన ఆయన బిర్సా ముండా జైలు లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

 Lalu Prasad Yadav Health Condition Not Stable1-TeluguStop.com

అయితే లాలూ గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న ఆయన రాంచీ లోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో చికిత్స పొందుతున్నారు.ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తుంది.

ఆయన మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని,దీంతో పాటు బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ సైతం నిలకడగా లేవని వైద్యులు అంటున్నారు.పశుగ్రాసం కుంభకోణంలో దోషిగా తేలడంతో 2017 నుంచి ఆయన జైలుశిక్ష అనుభవిస్తున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది అని ఆయనకు రిమ్స్ లో వైద్యం అందిస్తున్న డీకే ఝా తెలిపారు.

ప్రస్తుతం బ్లడ్ ఇన్‌పెక్షన్ లాలూ శరీరంలో వ్యాపించిందని, ఆయన కిడ్నీ 63 శాతం దెబ్బతినగా, 37 శాతం మాత్రమే సరిగా పనిచేస్తోందని డాక్టర్ ఝా తెలిపారు.

-Telugu Political News

యాంటీబయోటిక్ మెడిసన్లు కారణంగా కూడా ఆయన కిడ్నీ పనితీరు మందగించిందన్నారు.లాలూ తీసుకునే డయిట్ కూడా గతంలో కంటే తగ్గిందని, ప్రస్తుతం మందులు ఇస్తున్నామని ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు వైద్య బృందం తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube