అమెరికాలో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి.నెల కాలంలో వరుసగా ఇద్దరు భారతీయులు రోడ్డు ప్రమాదంలో చనిపోగా.
తాజాగా మరొక భారత సంతతికి చెందిన కుటుంభం కూడా ప్రమాదంలో అసువులు బాశారు.అయితే ఈ కుటుంభం విమాన ప్రమాదంలో మృత్యు వాత పడ్డారు.
ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్ లో జరిగినట్టుగా తెలుస్తోంది.వివరాలలోకి వెళ్తే.
అమెరికాలో తాజాగా చోటు చేసుకున్న విమాన ప్రమాదంలో భారత సంతతికి చెందిన వైద్య దంపతులు వారి కుమార్తె ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.డాక్టర్ జస్వీర్ ఖురానా, డాక్టర్ దివ్య ఖురానా వారి కుమార్తె దివ్య ఖురానా ముగ్గురు తమ సొంత విమానంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ప్రమాద సమయంలో వీరు ముగ్గురు మాత్రమే ఉన్నారని తెలుస్తోంది.అయితే
వారి ఇంకొక కుమార్తె వారితో పాటు వెళ్ళకపోవడంతో ఆమె ఒక్కతే ఆ కుటుంభానికి మిగిలిందని స్థానిక మీడియా తెలిపింది.ఈ ప్రమాదం తాలూకు శఖలాలని ఫిలడేల్పియా ప్రాంత శివారులో కనుగొన్నారు.వారు శుక్రవారం నాడు ఈశాన్య ఫిలడేల్పియా నుంచీ బయలు దేరి కొలంబస్ లోని ఒహియో స్టేట్ యూనివర్సిటీకి బయలుదేరుతుండగా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది.