పాక్ లో కాల్పుల కలకలం,ఇద్దరు మృతి

పొరుగుదేశం పాకిస్థాన్ లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.

పాక్ లోని లాహోర్ లో ఉన్న అల్లామా ఇక్బల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

ఎయిర్ పోర్ట్ లో ఇక గుర్తు తెలియని దుండగుడు ఈ కాల్పులకు తెగబడినట్లు తెలుస్తుంది.అయితే ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా,మరో వ్యక్తి గాయపడినట్లు తెలుస్తుంది.

అయితే ఈ కాల్పుల సమయంలో మక్కా నుంచి తిరిగి వచ్చిన ప్రయాణికులు ఎయిర్ పోర్ట్ లాంజ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఈ కాల్పుల ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.ఎయిర్ పోర్ట్ లో ఒక్కసారిగా తుపాకీ శబ్దం రావడం తో ఎయిర్ పోర్ట్ లో ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా భయబ్రాంతులకు గురై పరుగులు పెట్టారు.

అయితే కాల్పులు జరిపిన వ్యక్తి ఒక టాక్సీ ద్వారా ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడని అయితే లాంజ్ నుంచి వస్తున్న ప్రయాణికులను టార్గెట్ గా చేసుకొని కాల్పులు ప్రారంభించాడని పోలీసులు తెలిపారు.

Advertisement

ప్రస్తుతం ఆ దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తుంది.కాల్పుల వెనుక ఉగ్రకోణం లేదని, వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ కాల్పులు జరిగి ఉంటాయని అధికారులు చెబుతున్నారు.మరోపక్క ఈ కాల్పుల నేపథ్యంలో, ఎయిర్ పోర్టుకు వస్తున్న వాహనాలను నిలిపివేయడం తో పాటు విమానాశ్రయం వద్ద భద్రతను కూడా మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు