ప్రయివేట్ కళాశాల లో అనుమానా స్పద స్థితిలో మృతి చెందిన విద్యార్థి

ప్రయివేట్ కళాశాల లో ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితి లో మృతి చెందిన ఘటన విజయవాడ లో కలకలం రేపింది.విజయవాడ గూడవల్లి లోని నారాయణ విద్యాసంస్థ లో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం ఉదయం అనుమానాస్పద స్థితో లో మృతి చెందాడు.

 One More Teenager Dead In Narayana College-TeluguStop.com

అయితే ఆ విద్యార్థి మృతి పై కాలేజియే సిబ్బంది మాత్రం ఎలాంటి పొంతన లేని సమాధానాలు చెబుతుంది.ఒకసారి ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుండగా,మరోసారి బాత్ రూమ్ లో కాలుజారి పడ్డాడని మరోసారి ,కాదు గుండె పోటు తో మృతి చెందాడని పొంతనలేకుండా సమాధానం చెబుతుంది.

అంతేకాకుండా మీడియాను సైతం కాలేజీ లోపలి కి కూడా అనుమతించడంలేదు సరికదా గుట్టుచప్పుడు కాకుండా విద్యార్థి మృతదేహాన్ని కాలేజీ యాజమాన్యం ఒక ప్రయివేట్ ఆసుపత్రికి కూడా తరలించారు.దీనితో ఆ విద్యార్థి డి అనుమానాస్పద మృతిగా భావిస్తున్నారు.

కనీసం తల్లిదండ్రులకు కూడా సమాచారం ఇవ్వకుండా విద్యార్థి మృత దేహాన్ని ప్రయివేట్ ఆసుపత్రికి తరలించడం ఏమిటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ప్రయివేట్ కళాశాల లో అనుమానా స�

ఏపీ సి ఎం గా వై ఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత విజయవాడలోనే నారాయణ కు సంబందించిన పలు విద్యాసంస్థలను మూసివేసిన సంగతి తెలిసిందే.అయితే హర్షవర్ధన్ మృతి చెందినప్పటికీ పోలీసులకు కూడా సమాచారమివ్వకుండా కళాశాల యాజమాన్యం చర్యలు తీసుకోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అప్పటికే విద్యార్థి మృతి చెంది ఉండటంతో ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారమిచ్చారు.

దీంతో గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube