అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహానికి ఈ సారి అమెరికా ఫెడ్ ఛైర్మెన్ బలయ్యారు.ఇటీవల అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ జరిపిన సమీక్ష సమావేశంలో వడ్డీ రెట్ల లో కోట విధించమని ట్రంప్ సూచనలు చేసినా ఫెడ్ ఛైర్మెన్ జేరోమ్ పావెల్ అందుకు అంగీకారం తెలుపలేదు సరికదా .ప్రస్తుతం ఉన్న 2.25-2.5 శాతం వడ్డీ రేట్లను యధావిధిగా ఉంచేలా నిర్ణయం తీసుకున్నారు.అంతేకాదు ఈ ఏడాది మొత్తం వడ్డీ రేట్లలో కోట ఉండే అవకాశాలు లేవని, 2020లోనే వీటి గురించి ఆలోచన చేస్తామని పావెల్ వెల్లడించారు.
దాంతో ట్రంప్ పావెల్ నిర్ణయంపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారు.అధ్యక్షుడిగా నేను ఆదేసించినా సరే పావెల్ తన మాటని లెక్క చేయలేదని మొండిగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దాంతో తాజాగా జరిగిన మీడియా సమావేశంలో జేరోమ్ పావెల్ గురించి ప్రస్తావిస్తూ తాను వడ్డీ రేట్లు విషయంలో మార్పు కోరానని అందుకు పావెల్ అంగీకరించలేదని ఆరోపించారు.
పావెల్ విషయంలో తానూ సంతృప్తిగా లేనన, తన చర్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు.
ఈ నేపధ్యంలోనే, జెరోమ్ పావెల్ స్థానంలో ఫెడ్ ఛైర్మెన్ గా జెనెట్ ఎలెన్ను ట్రంప్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.త్వరలో అందుకు సంభదించిన ఉత్తరువులు కూడా వెలువడనున్నట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది.