ఒక్కొక్కరికి ఒక్కో చెడ్డ అలవాటు ఉంటుంది.అయితే కొందరు అతిగా దాన ధర్మాలు చేయడంను చెడ్డ అలవాటుగా పెట్టుకుంటారు, మరి కొందరు మందు కొట్టడం దమ్ము కొట్టడం చేస్తూ ఉంటారు.
మరి కొందరు ఇతరులపై చాడీలు చెప్పడం, అవతలి వారికి ఇవతలి వారిపై కోపం కలిగించేలా చేయడం చేస్తూ ఉంటారు.ఇంకా ఎన్నో చెడ్డ అలవాట్లు ఉన్న వారు ఉంటారు.
వారి వల్ల పెద్ద ప్రమాదం ఏమీ లేదు.కాని ఒక వ్యక్తి గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను.
అతడు మనిషి అని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు.ఎందుకంటే మరీ ఇంత రాక్షసంగా మనుషులు ఉంటారా అనిపిస్తుంది.
వెనకట రాక్షసులు ఉండే వారు, వారు మనుషులను జంతువులను పీక్కుని తినే వారు అని మనం సినిమాల్లో చూశాం, పుస్తకాల్లో చదివాం.కాని వారు నిజంగా కూడా ఇప్పటికి ఉన్నారని కొందరిని చూస్తుంటే అర్ధం అవుతుంది.
రాక్షసులు మనుషుల మద్యలోనే తిరుగుతున్నారు.వారిని మనం మనుషులు అనుకుని మోసపోతున్నాము.
తాజాగా అమెరికాలోని మిస్సోరీలో 20 ఏళ్ల యువకుడు చేస్తున్న పనికి స్థానికులు అంతా భయబ్రాంతులకు గురయ్యాడు.పిల్లి పిల్లలను అతడు చంపి వాటిని అత్యంత దారుణంగా హింసించి వాటితో ఆడుకున్న తీరు వింటూ ఉంటే ఇలాంటి వ్యక్తితో ఇన్నాళ్లు మనం కలిసి ఉన్నామా అంటూ స్థానికులు గుండెలు పట్టుకుంటున్నారు.

కైనీ లౌజడర్ అనే 20 ఏళ్ల కుర్రాడు ఆన్లైన్ ద్వారా పిల్లులను దత్తత తీసుకుంటాడు.కొన్నింటికి డబ్బులు చెల్లిస్తాడు, కొన్ని పిల్లులను ఫ్రీగా తీసుకుంటాడు.అతడిలో రాక్షసుడు ఆ పిల్లిని చూడగానే లేస్తాడు.పిల్లులు బాధతో అరుస్తూ ఉంటే అతడు సంతోషిస్తాడు.పిల్లి పిల్లలను బాగా హింసించి వాటి శరీర భాగాల్లోంచి ఒక్కొక్కటి పీకి ఆ తర్వాత వాటి ప్రవర్తనను తెలుసుకునేందుకు ప్రయత్నించే వాడు.పిల్లి కళ్లు ఒక్కొక్కటిగా పొడిచేసి ఆ తర్వాత అవి ఎలా ఉంటాయని చూసి ఆనందించే వాడు.
ఇంకా చెప్పుకుంటూ పోతే కడుపులో పేగులు బయటకు వచ్చేలా మీరు వాంతులు చేసుకుంటారు.
స్టానికులు తమ పరిసరాల్లో ఎక్కువగా పిల్లుల మృతదేహాలు ఉంటున్నాయి అని ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు నిఘా పెట్టి కైని ని పట్టుకున్నారు.
అతడిని విచారించగా ఆశ్చర్యకర విషయాలను వెల్లడించాడు.అతడికి 40 లక్షల జరిమానా మరియు జైలు శిక్ష విధించడం జరిగింది.







