అయోధ్య కేసులో ముగ్గురు సభ్యులతో మధ్యవర్తిత్వం! సుప్రీం కోర్ట్ తీర్పు!

అయోధ్య కేసులో సుప్రీం కోర్ట్ తీర్పు చివరి దశకి చేరుకుంది.ఈ కేసులో దశాబ్దాలుగా హిందూ, ముస్లిం ల మధ్య వాదనలు విన్న సుప్రీం కోర్ట్ చివరికి రెండు వర్గాల మధ్య వర్తిత్వంతో సమస్యని పరిష్కరించుకోవాలని తీర్పు చెప్పింది.

 Supreme Court Order On Mediation In Ayodhya Case-TeluguStop.com

దాంతో పాటు రెండు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేయడానికి సుప్రీం కోర్ట్ ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో ఈ కమిటీ పని చేస్తుంది.

ఇక ఈ కమిటీలో న్యాయవాది శ్రీరాం పంచు, పండిట్ రవిశంకర్ లు సభ్యులుగా ఉంటారని పేర్కొంది.

ఇక ఈ కమిటీ నాలుగు వారాలలో నివేదిక ఇచ్చి, ఎనిమిది వారాలలోగ సమస్యని పరిష్కరించాలని ధర్మాసనం సూచించింది.

అయితే ఈ మధ్యవర్తిత్వంకి ముస్లిం సంఘాలు ఒకే చెప్పిన కూడా హిందూ సంఘాలు మాత్రం అభ్యంతరం చెబుతున్నాయి.అసలు మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కారం కాదని వాదిస్తున్నాయి.

అయితే సుప్రీం కోర్ట్ మాత్రం హిందూ సంఘం తరుపున న్యాయవాది వాదనలు తోసిపుచ్చి మధ్యవర్తిత్వంతో సమస్య పరిష్కరించుకోవాల్సిందే అని తీర్పు వెలువరించింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube