శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం పడి పడి లేచే మనసు ఈ చిత్రం ఎన్నో అంచనాల నడుమ విడుదలైంది.శతమానంభవతి, మహానుభావుడు చిత్రాల తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు కూడా శర్వానంద్ సినిమా పడి పడి లేచే సినిమా పై భాగానే ఆశలు పెట్టుకున్నారు.
అందులో ఫిదా మూవీ ఫేం సాయి పల్లవి నటిస్తుండగా సినిమా అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
శర్వ కూడా సుధీర్ వర్మ తో ఒకే అయినా సినిమాను పక్కన పెట్టి మరి హను సినిమాపై దృష్టి పెట్టాడు.హను రాఘవ పూడి సినిమాను 70రోజుల్లో సినిమాను పూర్తి చెయ్యాలనుకున్నాడు.కానీ అంతకు అంత రెండింతలు సమయం తీసుకున్నాడు.
శర్వ కూడా ఎంతో ఓపికతో హను మీద నమ్మకంతో డేట్స్ ఇచ్చేశాడు.కానీ తీరా సినిమా విడుధలైనక చూస్తే పరిస్థితి వేరేల ఉన్నది.ఈ సినిమా రెండోవ వారానికే పూర్తిగా పడిపోయింది.8 కోట్ల లోపే షేర్ ను మాత్రమే రాబట్టింది.ఈ సినిమా విడుదలకు ముందు శర్వ కెరీర్ బెస్ట్ మూవీ అవ్వుతుందని స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు కానీ ఆ పరిస్థితి ఏమాత్రం కనిపించలేదు.సాయి పల్లవి మ్యాజిక్ కూడా ఏ మాత్రం పనిచెయ్యలేదు.
అందుకే శర్వానంద్ పడి పడి లేచే మనసు విషయంలో చేసిన తప్పును మరల సుధీర్ వర్మ సినిమాలో చెయ్యకూడదని నిర్ణయించుకున్నాడు.
పడి పడి లేచే మనసు సినిమా విషయంలో శర్వానంద్ పూర్తిగా దర్శకుడిపై బారం వేశాడు.కానీ ఈ సారి తన ఇన్వాల్వ్మెంట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట.ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాకు తనవంతు సూచనలు, సలహాలు ఇస్తున్నాట్లుగా సమాచారం అందుతోంది.
తనకు పరిచయం ఉన్న ఫిల్మ్ మేకర్స్ వద్దకు కూడా సినిమా రాషెస్ ను తీసుకు వెళ్ళి చూపిస్తున్నాట్లుగా తెలుస్తోంది.మొత్తానికి శర్వా ఈ సారి ఛాన్స్ తీసుకోవడం లేదు.