టీడీపీ ఎంపీల సస్పెన్షన్ !

ఈ రోజు లోక్ సభ లో టీడీపీ ఎంపీలకు చేదు అనుభవం ఎదురయ్యింది.విభజన సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చి, ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలంటూ లోక్‌సభలో ఆందోళనకు దిగిన టీడీపీ ఎంపీలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సస్పెండ్‌ చేశారు.

 Telugudesam Party Mps Suspension-TeluguStop.com

సభ సజావుగా సాగడానికి సహకరించాలని స్పీకర్ అనేకసార్లు కోరినా… వారు మాట వినకపోవడంతో సభా కార్యకలాపాలకు అడ్డుపడుతున్నారంటూ వారిని సస్పెండ్ చేశారు.

ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, తోట నరసింహం, మురళీమోహన్‌, బుట్టారేణుక, అవంతి శ్రీనివాస్‌, మాగంటి బాబు, జేసీ దివాకర్‌రెడ్డి, శ్రీరాం మాల్యాద్రి, అశోక్‌ గజపతిరాజు, కొనకళ్ల నారాయణలను నాలుగు రోజుల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube