తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం రోజు రోజుకి వేగంగా మార్పు చెందుతోంది.కేసీఆర్ మరో సారి అధికారంలోకి రావడంతో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు దిక్కుతోచని స్థితిలో ఏమి చేయాలో తెలియక సతమతమవుతున్నాయి.
అయితే తెలంగాణలో కేలవం రెండంటే రెండు సీట్లని గెలుచుకుని జబ్బలు చరుచుకుంటున్న టీడీపీ పార్టీకి.ఆ ఇద్దరు నేతలు ఘలక్ ఇవ్వనున్నారని.
త్వరలో టీఆర్ఎస్ గూటికి చేరిపోతారనే వ్యాఖ్యలు సైతం వినిపించాయి.అయితే ఇదేమి లేదని సదరు ఎమ్మెల్యేలు చెప్పినా ఆ ఇద్దరిలో ఒక ఎమ్మెల్యే మాత్రం సైకిల్ దిగి కారు ఎక్కనున్నారని, ఇది పక్కా అంటూ టీడీపీ వర్గాలు సైతం చెవులు కొరుక్కుంటున్నాయి…ఇదిలాఉంటే
సండ్ర , మచ్చ ఇద్దరిలో ఒకరు కారు ఎక్కనుండగా ఇప్పుడు ఇదే వరసలో బాబు కి షాక్ ఇస్తూ మరో టీడీపీ కీలక నేత.మాజీ ఎంపీ ఖమ్మంలో టీడీపీ కి ఆయువుపట్టు అయిన నామా సైతం ఈ లిస్టు లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది.అంతేకాదు అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, నామా టీఆర్ఎస్ జెండా కప్పుకునే రోజు ఏంతో దూరంలో లేదని , అందుకు తగ్గ కీలక భేటీ సైతం తాజాగా జరిగిందని తెలుస్తోంది.
దాంతో ఖమ్మం జిల్లా రాజకీయాలలో కీలక మార్పులు జరగడం తధ్యంగా కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.ఇంతకీ నామా కీలక భేటీ ఎవరితో జరిగింది.నామా కారెక్కే స్కెచ్ వ్యుహకర్త ఎవరూ అనే వివరాలలోకి వెళ్తే…
కేసీఆర్ ఓటమి కోసం కాంగ్రెస్ తో సైతం చేతులు కలిపిన తెలంగాణా చంద్రబాబు ని ఓడించడం మాత్రమే కేసీఆర్ ధ్యేయం కాదు.అసలు టీడీపీ పార్టీని తెలంగాణలో ఉండకుండా చేయడమే కేసీఆర్ అసలు టార్గెట్.ఈ క్రమంలోనే ఖమ్మంలో టీఆర్ఎస్ తన ఆధిపత్యం కోసం నామా ఎంట్రీ కి భారీ స్కెచ్ వేసింది.నామ గనుకా గులాబీ కండువా కప్పుకుంటే ఖమ్మంలో ఉన్న కమ్మ వర్గం దాదాపు టీఆర్ఎస్ వైపు టర్న్ అవుతుందనేది వాస్తవం.
ఇది గ్రహించిన కేసీఆర్ ఆ భాద్యతని మాజీ మంత్రి తుమ్మలకి అప్పగించారట.అంతేకాదు నామాని, సండ్రని కారెక్కిస్తే కేసీఆర్ తుమ్మలకి మాంచి పదవిని కట్టబెట్టాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.దాంతో
బాబుకి తెలంగాణలో చివరికి పట్టుకొమ్మలుగా మిగిలిన ఆశ్వారావుపేట ,సత్తుపల్లి ,ఖమ్మం నియోజకవర్గాలని, టీఆర్ఎస్ కంచుకోటలుగా మలిచే ప్రయత్నం చేస్తున్నాడు.అయితే తాజాగా జరిగిన తుమ్మల , నామా భేటీలో పలు కీలక విషయాలు చర్చించిన తుమ్మల, నామా కి అన్ని విధాలా న్యాయం చేస్తామని, టీఆర్ఎస్ నుంచీ ఎటువంటి సాయం కావాలన్నా సరే తప్పకుండా తన పూర్తి మద్దతు ఉంటుందని, నామా కి తుమ్మల మాట ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.ఏది ఏమైనా సరే కేసీఆర్ వ్యూహం ప్రకారం.నామా టీఆర్ఎస్ లోకి ఎంట్రీ ఇస్తే దాదాపు ఖమ్మం లో టీడీపీ పని ఖతం అయినట్టే అనే టాక్ జోరుగా వినిపిస్తోంది.