టీఆర్ఎస్ పార్టీ తరుచు ఏదో ఒక విషయంలో తెలంగాణ ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.నిన్న సర్వే ఫలితాలు ప్రకటిస్తూ ఓటర్లను అయోమయానికి గురిచేస్తున్నాడు అంటూ….లగడపాటి రాజ్ గోపాల్ పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా… తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , కవితలపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి టీఆర్ఎస్ నాయకుడు దండే విఠల్ ఆధ్వర్యంలో కొంతమంది నాయకులు ఫిర్యాదు చేశారు.అలాగే కొన్ని సంస్థలు చేసిన సర్వే రిపోర్ట్స్ అంటూ… కొన్ని న్యూస్ ఛానెల్స్ ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నాయి అంటూ వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
.