శ్రీనువైట్లకు కారిపోతుందట

మాస్‌ మహారాజా రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ చిత్రంలో రవితేజ మూడు విభిన్న గెటప్స్‌లలో కనిపించబోతున్నాడు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ శాతం అమెరికాలో నిర్వహిస్తున్నారు.దాంతో పాటు స్టార్‌ హీరోయిన్స్‌ ఇలియానా మరియు శృతిహాసన్‌లు నటిస్తున్నారు.

ఈ ఇద్దరికి కలిపి ఏకంగా మూడు కోట్ల పారితోషికంను ఇస్తున్నారు.మొత్తంగా ఈ చిత్రం బడ్జెట్‌ రవితేజ స్థాయిని దాటేస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయినా కూడా పర్వాలేదు అని నిన్నమొన్నటి వరకు శ్రీనువైట్ల భావిస్తూ వచ్చాడు.

Advertisement

తాజాగా రవితేజ నటించిన ‘నేలటిక్కెట్టు’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది.దాంతో ఇప్పుడు రవితేజ తర్వాత సినిమా అంటే ప్రేక్షకులు మరియు డిస్ట్రిబ్యూటర్లు అంతగా ఆసక్తి చూపడం లేదు.అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చే పరిస్థితి లేదు.

దాంతో దర్శకుడు శ్రీనువైట్ల తెగ టెన్షన్‌ పడిపోతున్నాడు.డిస్ట్రిబ్యూటర్‌లు రాకుంటే దర్శకుడికి వచ్చిన సమస్య ఏంటా అని భావిస్తున్నారా.

ఈ చిత్రం నిర్మాణ భాగస్వామిగా శ్రీనువైట్ల వ్యవహరిస్తున్నాడు.ఈ చిత్రం కోసం శ్రీనువైట్ల పారితోషికం తీసుకోక పోవడంతో పాటు తన ఆస్తిని కుదువ పెట్టి దాదాపు 6 కోట్ల రూపాయలను సినిమాకు ఖర్చు చేశాడట.

సినిమా సక్సెస్‌ అయితేనే ఆ ఆరు కోట్లతో పాటు పారితోషికం వస్తుందని తెలుస్తోంది.ఈ చిత్రం కోసం శ్రీనువైట్ల పది కోట్ల మేరకు పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
Nutmeg Helps To Lose Weight After Delivery Nutmeg, Lose Weight, Delivery, After Delivery, Latest

అంత మొత్తం తిరిగి రావాలి అంటే మినిమం సక్సెస్‌ అవ్వాలి.ఒక వేళ సినిమా సక్సెస్‌ కాకుంటే మళ్లీ సినిమా మాట ఎత్తే పరిస్థితి ఉండదు.

Advertisement

ఇప్పటికే వరుసగా నాలుగు అతి పెద్ద డిజాస్టర్‌లు శ్రీనువైట్ల ఖాతాలో ఉన్నాయి.అందుకే ఈ సినిమా కూడా ఫ్లాప్‌ అయితే తన పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు.

రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ మరియు ‘నేలటిక్కెట్టు’ చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాయి.ఈ సమయంలో ఆయన తర్వాత సినిమా కూడా అదే ఫలితంను చవిచూస్తుందని, దానికి తోడు శ్రీనువైట్ల దర్శకత్వం కూడా ఏమాత్రం ఆకట్టుకునే విధంగా ఉండదు అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ కారణంగానే శ్రీనువైట్ల ప్రస్తుతం భయంతో వణికి పోతున్నాడు.దర్శకుడిగా ఈ సినిమా సక్సెస్‌ను తెచ్చి పెట్టకపోతే, కెరీర్‌లో ఇదే చివరి సినిమా అవ్వడం ఖాయం అని ఆయన భయపడుతున్నాడు.

దసరా సీజన్‌లో శ్రీనువైట్ల అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్దం అవుతున్నారు.

తాజా వార్తలు