అల్లరి నరేష్ నటించిన తాజా చిత్రం “ఇంట్లో దెయ్యం నాకేం భయం”.జీ.
నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరమైన ఫ్లాప్ గా నిలిచింది.ఆ విషయం పక్కనపెడితే, ఆ సినిమా చూస్తూ ఓ వ్యక్తి చనిపోవడం ఇప్పుడు సంచలనంగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే, సిద్దిపేటకు చెందిన మొహమ్మద్ షాదుల్ (30) అక్కడే శ్రీనివాస్ థియేటర్లో ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా చూస్తూ తుదిశ్వాస విడిచాడు.శవాన్ని చూసిన థియేటర్ యాజమాన్యం పోలీసులను పిలవటంతో, శవాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు.
ఈ వ్యక్తి హార్ట్ ఎటాక్ తో మరణించాడని తేల్చారు డాక్టర్లు.
ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, సినిమా చూసినందుకు తనకు హార్ట్ ఎటాక్ వచ్చిందా లేక ఇతర సమస్యల వలన వచ్చిందా ? ఆ సినిమా చూస్తే చిన్నపిల్లలకి కూడా భయం వేయదు, కాబట్టి ఇతర కారణాల వలన గుండె ఆగిపోయి ఉండవచ్చు.