టీవి 9 ఛానేల్ ని రెగ్యులర్ చూసే అలవాటు ఉంటే మీకు జాఫర్ అనే జర్నలిస్టు తెలిసే ఉండాలి.ఈ జాఫర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి, జనతా గ్యారేజ్ ఫేక్ కలెక్షన్లతో టాప్ 3 లోకి వచ్చింది, కర్ణాటకతోపాటు, అంధ్రప్రదేశ్ లోని కొన్ని ఏరియాల్లో బాగా ఫేక్ చేసారని ఓ ట్వీట్ కనబడింది.
అంతేకాదు, ఇకపై ఎన్టీఅర్ సినిమాల కథలన్ని రాజమౌళి వింటారని, రాజమౌళికి వక్కంతం వంశీ కథ నచ్చలేదు కాబట్టే ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందని మరో ట్వీట్ పడింది.ఎన్టీఆర్ పై ఇలా డైరెక్టుగా దాడి చేస్తున్నాడేంటి ఈ జర్నలిస్టు అని అందరు ఆశ్చర్యపోతుండగానే అసలు ట్విస్టు బయటపడింది.అది ఫేక్ అకౌంట్ అంట.
“గమనిక : ట్విట్టర్ లో నా పేరు మీద ఎవరో ఫేక్ అకౌంట్ క్రియట్ చేసి …వాళ్లకు పడని వారి పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు … అసలు ఈ అకౌంట్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు …ఈమేరకు ట్విట్టర్ కు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ….వాళ్ళు దర్యాప్తు మొదలు పెట్టారు …అవకాశం ఉంటే మీరు కూడా ట్విట్టర్ దృష్టికి తీసుకెళ్లాలని -మనవి” అంటూ టీవి 9 జాఫర్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా తెలిపారు.
ఇలా ఫేక్ ఖాతాలు నటులపై దాడి చేయడం కొత్తేమి కాదు.
కొన్నిరోజుల క్రిందట మహేష్ బాబు యాక్టింగ్ మురుగదాస్ కి నచ్చట్లేదని ఇలాగే ఒక ఫేక్ వెబ్ సైట్ ప్రచారం చేసింది.







