యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జనతా గ్యారేజ్ కేవలం ఒక్క టీజర్ తో సంచలనం రేపుతోంది.
ఇప్పటికే యూ ట్యూబ్ లో సంచలనం రేపుతున్న ఈ టీజర్ మలయాళం లో కూడా అద్భుతమైన రెస్పాన్స్ ని తెచ్చుకుంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా క్లిమాక్స్ చిత్రీకరణ లో ఉంది.కొరటాల శివ డైరెక్షన్ లో భారీ స్థాయి లో క్లిమాక్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ క్లిమాక్స్ తరవాత రెండు పాటలు షూటింగ్ చెయ్యాల్సి ఉంటుంది.ఈ రెండు పాటలనీ తరవాత రాబోయే షెడ్యూల్ లో చిత్రీకరణ చేస్తారు.
హైదరాబాద్ లో ఓకే పాటనీ కేరళ లో ఒక పాటనీ చిత్రీకరణ చేస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ యూట్యూబ్ లో సంచలనం రేపుతోంది.
ఈ టీజర్ చిత్రం పై అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి.సమంతా, నిత్యామీనన్ లు కథానాయికలు గా నటిస్తున్నారు.
మలయాళం నటుడు మోహన్ లాల్ ఓ ప్రముఖ పాత్ర ను పోషిస్తున్నాడు.దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 12 న విడుదల కాబోతోంది.







