పదమూడు రోజులుగా తన నిరాహార దీక్ష తో రాజమండ్రి లో ఉన్న ముద్రగడ పద్మనాభం చివరికి దీక్ష ని విరమించారు.రాజమండ్రి లోని ఆసుపత్రి నుంచి కిర్లంపూడి లో తన సొంత ఇంటికి చేరుకున్న ఆయన అక్కడ నిమ్మరసం తాగి మరీ దీక్షకి ఫుల్ స్టాప్ పెట్టారు.
ఆయన ఈ దీక్ష తరవాత ఎంత ఆరోగ్యంగా ఉన్నారు అనేది లోకల్ డాక్టర్ లు పరీక్షలు నిరవహించారు.మీడియా తో ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పరుష పదజాలం వాడడం ఇబ్బందికరంగా ఉంది.
ప్రభుత్వం మీద బూతు పురాణం అందుకున్న ఆయన మీడియా ప్రతినిధులు మరొక ప్రశ్న కూడా వెయ్యడానికి వీలులేదు అన్నట్టుగా మాట్లాడారు.
బూతులు ఓపెన్ గా మీడియా ముందు మాట్లాడ్డం అందరూ చేసే సాహసం కాదు.
కానీ ముద్రగడ మాత్రం ” నా కొడుకు ని కొట్టుకుంటూ తీసుకుని వెళతారా ? లం .కోడకల్లరా ” అంటూ పచ్చి బూతులు మాట్లాడుతూ తన ఆవేశం ప్రదర్శించారు.తన ఇంట్లో తలుపులు బద్దలు కొట్టారు అనీ ఆ విషయం లో పోలీసులదే తప్పు అంటున్నారు ఆయన.
తనని గౌరవంగా తీస్కెళ్ళినా తన భార్యని బూతులు తిడుతూ తీసుకుని వెళ్ళారు అనేది ఆయన కోపం.కోడల్ని – బావమరిది భార్యలను ‘లం… రావే’ అంటూ లాక్కెళ్లారని ఆరోపించారు.పోలీసులు తమను ఖైదీల కంటే హీనంగా చూశారని ఆరోపించారు.