ప్రభాస్ కోసం హైదరాబాద్ లోనే రోమ్ సిటీ కట్టేస్తున్నారు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ బ్యానర్ పై జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో జాన్ అనే పీరియాడికల్ లవ్ స్టొరీ తెరకెక్కుతున్న సంగతి అందరికి తెలిసిందే.

ఓ వైపు యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సాహో సినిమా మెజారిటీ షూటింగ్ ఫినిష్ చేసిన ప్రభాస్ ప్రస్తుతం కొత్త సినిమా షూటింగ్ కోసం తన లుక్ మార్చుకునే పనిలో పడ్డాడు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాష్ వింటేజ్ కార్ల వ్యాపారిగా కనిపిస్తాడని, అప్పటి రోమ్ సిటీలో ధనిక ప్రజలు ఎలా ఉండేవారో అలాంటి ఆహార్యంలో కనిపిస్తాడని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో కనిపించే రోమ్ సిటీని సుమారు 80 కోట్ల రూపాయిలతో అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్మిస్తున్నారని తెలుస్తుంది.

కళా దర్శకుడు రవీందర్ రోమ్ సిటీ సెట్ ని డిజైన్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.ఇక ఈ సెట్ నిర్మాణం పూర్తి కాగానే మెజారిటీ షూటింగ్ అందులో పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్డేతో ప్రభాస్ రొమాన్స్ అందరికి ఆకట్టుకుంటుంది అని, వింటేజ్ ఫారిన్ లవ్ స్టొరీ చూసిన ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకుంటున్నారు.

Advertisement
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

తాజా వార్తలు