భారత్లో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి.మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఢిల్లీ ప్రగతి మైదాన్ లో ఇండియా మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది.ముందుగా 13 నగరాల్లో ఈ సేవలు ప్రారంభం అయ్యాయి.
వాటిలో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు, చండీగఢ్, గాంధీనగర్, గురుగావ్, హైదరాబాద్, జామ్ నగర్, లక్నో, పుణె నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి.మిగిలిన నగరాల్లో ఈ ఏడాది డిసెంబర్ నాటికి దశల వారీగా 5జీ సేవలు విస్తరించనున్నాయి.