డ్రగ్స్ మత్తులో భారతీయుడిని చంపింది...చివరికి....

జతిందర్ బ్రార్ అనే భారతీయ యువకుడు చదువుల్లో ముందు ఉండే వాడు.

భారత్ లో చదువు పూర్తి చేసుకున్న తరువాత ఉన్నత చదువుకోసం ఆస్ట్రేలియా వెళ్ళాడు.

ఒక పక్క చదువుకుంటూనే మరో పక్క అక్కడి సూపర్ మార్కెట్ లో ట్రక్ డ్రైవర్ గా పనిలో చేరాడు.అయితే జనవరి లో తన విధులని పూర్తి చేసుకుని స్టోర్ నుంచీ బయటకి వస్తున్న ట్రక్ ని డ్రగ్స్ మత్తులో ఉన్న 27 ఏళ్ళ యువతి.

ఆమె దొంగిలించిన కారుతో వేగంగా వచ్చి డీ కొట్టింది.దాంతో ఒక్క సారిగా పల్టీలు కొట్టిన జతిందర్ ట్రక్ కొంత దూరంలో ఆగింది.

ఈ ఘటనలో అక్కడికక్కడే అతడు ప్రాణాలు విడిచాడు.అయితే అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా ఆమె అక్కడి నుంచీ తప్పించుకోవడానికి వేగంగా వెళ్ళిపోయింది.

Advertisement

ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆమె వాహనాన్ని హెలికాఫ్టర్ సాయంతో వెంబడించారు.ఎట్టకేలకి ఆమె జాడ తెలుసుకుని పట్టుకున్న పోలీసులు కోర్టు ముందు హాజరుపరుచాగా ఆమె తాను చేసిన నేరాన్ని అంగీకరించింది.

దాంతో సుమారు ఏడాది పాటుగా జైలులోనే ఉన్న ఆమెకి న్యాయస్థానం 7 ఏళ్ళ జైలు శిక్షని అమలు చేస్తూ తీర్పు చెప్పింది.అంతేకాదు ఆమెకి ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ని కూడా రద్దు చేస్తున్నట్టుగా తీర్పు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు