తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది.కాలినడక భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేసింది.
టికెట్లను నేటి నుంచి పునః ప్రారంభించిన టీటీడీ వారం రోజుల పాటు ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనుంది.అలిపిరి నడక మార్గంలో రోజుకు పదివేల టోకెన్లను కేటాయించనున్నారు.
అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గంలో ఐదు వేల టోకెన్లను కేటాయిస్తారు.కరోనా కారణంగా దివ్య దర్శనం టోకెన్లను నిలిపివేసిన టీటీడీ దాదాపు మూడేళ్ల తరువాత ఈ ప్రక్రియను మళ్లీ ప్రవేశపెట్టింది.