హాట్ యాంకర్ కి నందమూరి హీరోతో పోటి

బాక్సాఫీస్ వద్ద రష్మీ గౌతమ్ దండయాత్ర కొనసాగుతూనే ఉంది.

గుంటూరు టాకీస్ కి తన గ్లామర్ వలన మంచి ఓపెనింగ్స్ వచ్చినా, ఆ తరువాత ఈ అమ్మడి కెరీర్ పూర్తిగా డవున్ అయిపోయింది.

తన గ్లామర్ క్రేజ్ ఏదో వన్ ఫిలిమ్ వండర్ లా అనిపించింది ట్రేడ్ విశ్లేషకులకి.అయినా, రష్మీ పట్టు విడవటం లేదు.

"తను వచ్చేనంట" అంటూ మరో హర్రర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తోంది.అది కూడా సోలోగా కాదు.

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన "ఇజం" విడుదల తేదిరోజే తన కొత్త చిత్రాన్ని విడుదల చేస్తోంది రష్మీ.తెలుగులో తొలి జాంబీ మూవి అన్న నమ్మకమో లేక తన గ్లామర్ ఆకట్టుకుంటుదన్న ఆత్మవిశ్వాసమో కాని, నందమూరి హీరోతో ఢీ కొడుతోంది.

Advertisement

ఇజం, తను వచ్చెనంటా .రెండూ అక్టోబరు 21వ తేదిన విడుదల అవుతున్నాయి.మరి గుంటూరు టాకిస్ మాదిరిగా బాక్సాఫీసు దగ్గర రష్మీ మళ్ళీ చప్పుడు చేస్తుందో, లేక ఇజం దెబ్బకి జనాల దృష్టిలో పడకుండానే థియేటర్ల నుంచి వెళ్ళిపోతుందో చూడాలి.

ఇక ఈ సినిమా కూడా అపజయాన్నే చవిచూస్తే, రష్మీ గ్లామర్ ఇమేజ్ కి కాలం చెల్లిందనే చెప్పాలేమో! .

Advertisement

తాజా వార్తలు