వైసీపీలో హైప‌ర్ ఆది సంద‌డి

జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌లో సంద‌డి చేసే హైప‌ర్ ఆది వైసీపీలో సంద‌డి చేయ‌డం ఏంటా అని షాక్ అవ్వొద్దు.

జ‌బ‌ర్ద‌స్త్ ప్రోగ్రామ్‌లో త‌న కామెడీతో బుల్లితెర ప్రేక్ష‌కుల మ‌దిలో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న హైప‌ర్ ఆది ఓ వైసీపీ ప్రొగ్రామ్‌లో నానా హంగామా చేశాడు.

అయితే ఇది వైసీపీ పార్టీ ప‌ర‌మైన ప్రోగ్రామ్ కాదు.ప్ర‌కాశం జిల్లాలోని మార్కాపురంలో లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి.


ఈ ఉత్స‌వాల్లో భాగంగా వైసీపీ నాయ‌కులు విద్యుత్ ప్ర‌భ ఏర్పాటు చేశారు.ఈ ప్ర‌భ‌పై జ‌రిగిన సాంస్కృతిక కార్య‌క్ర‌మంలో హైపర్ ఆది, రైజింగ్ రాజు చేసిన స్కిట్స్ ఆకట్టుకున్నాయి.

వైసీపీ విద్యుత్‌ ప్రభపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంక‌ట‌రెడ్డి ప్రారంభించారు.
ఇదిలా ఉంటే గ‌తంలోనే హైప‌ర్ ఆదితో ఆ పార్టీ ఎమ్మెల్యే, జ‌బ‌ర్ద‌స్త్ జ‌డ్జి రోజా సైతం ఆది పంచ్‌లు చూసి న‌వ్వు రాజ‌కీయాల్లోకి వ‌స్తే ఎమ్మెల్యే టిక్కెట్టు ఇస్తామ‌ని స‌ర‌దాగా అన్న‌ట్టు కూడా వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Advertisement


ఈ సందర్భంగా జంకె వెంకటరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌, మాజీ ఎమ్మెల్యే కె.పి.కొండారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు వస్తే జిల్లా ప్రకాశిస్తుందని ఎన్నికలలో ఇచ్చిన హామీలను నేతలు విస్మరించి ప్రజలను మభ్య పెడుతున్నారన్నార‌ని విమ‌ర్శించారు.

గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!
Advertisement

తాజా వార్తలు