తెలుగు దేశం పార్టీ అధినేత ఢిల్లీ పర్యటన సందర్భంగా వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు( Raghu Rama Krishna Raju ) హడావుడి చేశాడు.గత కొన్నాళ్లుగా పూర్తిగా ఢిల్లీకే పరిమితం అవుతున్న రఘురామ కృష్ణంరాజు రాజకీయ భవిష్యత్తు గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
ఎప్పుడెప్పడు ఎంపీ రఘురామ తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రకటన చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.వచ్చే ఎన్నికల్లో వైకాపా( YCP ) తరపున పోటీ చేయడం నూటికి నూరు శాతం సాధ్యం కాదు.
తాజాగా చంద్రబాబు నాయుడు ను కలిశాడు కనుక వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ సీటు పై పోటీ చేసినా ఆశ్చర్యం లేదు అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.పెద్ద ఎత్తున రఘురామ కృష్ణంరాజు రాజకీయ భవిష్యత్తు గురించి జనాలు మాట్లాడుకుంటున్నారు.
కనుక ముందు ముందు ఈ విషయంలో రఘురామ కృష్ణం రాజు ను తెలుగు దేశం పార్టీ( TDP ) ) లోకి తీసుకునే విషయమై చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) ఆసక్తి చూపించే అవకాశాలు ఉన్నాయి అంటూ రాజకీయ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

మొత్తానికి ఏపీ రాజకీయాల్లో వివాదాస్పద ఎంపీగా పేరు దక్కించుకున్న రఘురామ వచ్చే ఏడాది జరుగబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న రఘురామ కృష్ణం రాజు ను తెలుగు దేశం పార్టీ లో చేర్చుకోవడం వల్ల అన్ని విధాలుగా కలిసి వస్తుందని తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నాడు.

అదే జరిగితే కచ్చితంగా రఘురామ కృష్ణం రాజు మళ్లీ పార్లమెంట్ లో అడుగు పెట్టడం సైకిల్ ఎక్కి అంటూ రాజకీయ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బీజేపీ తో పొత్తు విషయంలో మాట్లాడేందుకు గాను ఢిల్లీ వెళ్లాడు అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
