YSRCP Dharmana Prasadrao మా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది వైసీపీ మంత్రి కీలక వ్యాఖ్యలు..!!

వైసీపీ మంత్రి ధర్మన్న ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.తమ ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉందని వ్యాఖ్యానించారు.

అయితే వ్యతిరేకతకు గల కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ప్రజలు అర్థం చేసుకోకపోవడమేనని స్పష్టం చేశారు.శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

సంస్కరణలు తీసుకొచ్చే ప్రభుత్వంపై ప్రజలలో వ్యతిరేకత ఉండటం సర్వసాధారణమని తెలిపారు.అయితే సంస్కరణలు చేపట్టిన తొలినాళ్ళల్లో ఫలితాలు ముందుగా రావని చెప్పుకొచ్చారు.

అది అమలైన కొంతకాలం తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ప్రజల ఆమోదం లభిస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యానించారు.అయితే ప్రజలకు మేలు జరిగే విషయంలో ప్రారంభంలో  వ్యతిరేకత వస్తుందని తెలిసినా కానీ ఈ సంస్కరణల విషయంలో ముఖ్యమంత్రి ముందుకు వెళ్ళటం సంతోషించదగ్గ విషయం అని చెప్పుకొచ్చారు.

Advertisement

ఇదే సమయంలో రాష్ట్ర రాజధాని గురించి మాట్లాడుతూ.న్యాయ రాజధానిగా కర్నూల్, శాసన రాజధానిగా అమరావతి.

అతి ముఖ్యమైన పరిపాలన రాజధానిగా విశాఖ ఉంటుందని స్పష్టం చేశారు.దీంతో మంత్రి ధర్మాన్న చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపాయి.

Advertisement

తాజా వార్తలు