వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి( Y S bhaskar reddy ) అరెస్ట్ అయిన విషయం తెల్సిందే.సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యొక్క శ్రీమతి వైఎస్ భారతి( Y S Bharati ) కి భాస్కర్ రెడ్డి స్వయాన మేనమామ అనే విషయం తెల్సిందే.
పైగా ఎంపీ అవినాష్ రెడ్డి యొక్క తండ్రి అవ్వడం వల్ల కూడా భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై వైకాపా లో సర్వత్రా చర్చ జరుగుతోంది.ఇటీవలే వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ఆందోళన నిర్వహించాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా ముఖ్య నాయకులతో పార్టీ అగ్ర నేతలు చర్చలు జరపడం కూడా జరిగింది.మరో వైపు సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా భాస్కర్ రెడ్డి అరెస్ట్ పై పార్టీ యొక్క అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కేసు లో అధికార పార్టీ నాయకులు అరెస్ట్ అవ్వబోతున్న నేపథ్యంలో ఆందోళన వ్యక్తం అవుతోంది.ఆ పార్టీ నాయకుల్లో ముందు ముందు ఎవరు అరెస్ట్ అవుతారో అనే ఆందోళన కనిపిస్తుంది.
మరో వైపు మొత్తం వైకాపా కూడా భాస్కర్ రెడ్డికి మద్దతుగా నిలవడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియా తో పాటు రోడ్ల మీద కూడా భాస్కర్ రెడ్డికి మద్దతుగా ప్రదర్శణలు చేస్తూ ఉన్నారు.ఈ కేసులో భాస్కర్ రెడ్డిని ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.తద్వారా అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి కేసు ను మొత్తం తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వైకాపా శ్రేణులు ఆందోళన చేస్తున్నాయి.
సీబీఐ తీరుకు వ్యతిరేకంగా.కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ కేసు ఎటు నుండి ఎటు తిరుగుతుందో అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.2019 లో అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ గెలవడం కోసం సానుభూతి కోసం వివేకా నంద రెడ్డి ని హత్య చేయించి ఉండవచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.